నిమ్స్‌ని పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్..

511
ghmc
- Advertisement -

డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణ పట్ల విస్తృతస్థాయిలో, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్.పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణ లో భాగంగా పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌లతో కలిసి పర్యవేక్షించారు.

నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో పూల కుండీలు, నీటి నిల్వలను తొలగించారు. డెంగ్యూ నివారణ లో భాగంగా హైదరాబాద్ నగరంలో ఫాగింగ్, స్ప్రింగ్ లను రెట్టింపు చేశాం…అన్ని పాఠశాలల్లో ఫాగింగ్ చేయడంతోపాటు డెంగ్యూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మేయర్ రామ్మోహన్.

- Advertisement -