‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు..

441
Namaste Trump
- Advertisement -

రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్‌కు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టులో దిగిన ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ గవర్నర్ ఆనందీబేన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు ట్రంప్‌కు స్వాగతం పలికాయి. అక్కడి నుండి ట్రంప్‌ దాదాపు 22 కిలోమీటర్ల దూరంలోని మొతేరా స్టేడియం వరకూ ఆయన ర్యాలీ జరుగనుంది. మొతేరాలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు ట్రంప్‌.

అయితే ట్రంప్‌ ప్రసంగించే అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం ఇప్పటికే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలతో నిండిపోయింది. పలువురు పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి టాటా గ్రూప్ సంస్థల అధినేత రతన్ టాటా స్టేడియంకు చేరుకుని, వేదికనెక్కగా, ప్రజలు కేరింతలు కొట్టారు. ఆపై బాలీవుడ్ స్టార్లు షారూక్ ఖాన్, అక్షయ్, మాధురీ దీక్షిత్, కంగనా రనౌత్ తదితరులు కూడా స్టేడియంలో ఉన్నారు.

- Advertisement -