బీజేపీ కిషన్ రెడ్డి…ప్రొఫైల్ ఇది

504
kishan reddy
- Advertisement -

బీజేపీ కిషన్ రెడ్డి..రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన అయినా అంచెలంచెలుగా జాతీయ స్ధాయి నేతగా ఎదిగారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి గెలిచిన ఆయన మోడీ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన తనకు అప్పజెప్పే బాధ్యతను సమర్దవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం కల్పించినందుకు నరేంద్ర మోడీకి, అమిత్ షా కు ధన్యవాదాలు తెలిపారు.

1964, మే 15న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో జన్మించారు గంగపురం కిషన్ రెడ్డి. ఏబీవీపీ,ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేవైఎం బలోపేతానికి కృషిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షడిగా ఎన్నికయ్యారు.

kishan reddy

ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కిషన్ రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేసిన సమయంలో మోడీకి దగ్గరయ్యారు. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలిసి పర్యటించిన నేపథ్యంలో మోడీ, కిషన్ రెడ్డి ఓకే రూములో బస చేశారు. మొత్తానికి కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి పేరు ఖరారు కావడంతో పార్టీశ్రేణుల్లో, ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా 2009, 2014లో అంబర్ పేట నుంచి గెలిచారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా, బీజేపీ రాక్ష అధ్యక్షడిగా పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ సునామీ ముందు ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు.

- Advertisement -