టిఆర్ఎస్‌లో చేరిన బీజేపీ-కాంగ్రెస్ కార్పొరేటర్లు..

270
trs
- Advertisement -

హైదరాబాద్:నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ కార్పొరేషన్‌కు చెందిన 25వ డివిజన్ కార్పొరేటర్ సిరిగాదా ధర్మపురి (బిజెపి), 40వ డివిజన్ కార్పొరేటర్ న్యామతాబాద్ శివచరన్(కాంగ్రెస్)లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలానికి చెందిన సావెల్ ఎంపిటిసి పుప్పాల రాజు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన నచ్చి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.నిజామాబాద్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు సిరిగాద ధర్మపురి,న్యామతాబాద్ శివ చరన్‌లు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్,బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారికి టిఆర్ఎస్ పార్టీ పక్షాన,నా పక్షాన వారికి హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నాను. వారి డివిజన్ల అభివృద్ధి కోసం పార్టీలో చేరారు.వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తాం.మా ఎమ్మెల్యేలు నేను మీ డివిజన్ల అభివృద్ధి కి కృషి చేస్తాం. అలాగే బాల్కొండ నియోజకవర్గ మెండోరా మండలం సావెల్ గ్రామ ఎంపిటిసి పుప్పాల రాజు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్‌లో చేరారు. వారికి హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నాను అని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాగుకోసం ఆలోచన చేస్తాడు. ఆయన ఆలోచన వల్ల రైతుకు మేలు జరుగుతుంది.రైతు సంక్షేమం కోసమే పని చేస్తాడు.అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ద్వారా బీడు భూముల్లోకి నీటిని మళ్లించి సస్యశ్యామలం చేశారు. 300 మీటర్ల లోతున ఉన్న నీటిని పంట భూముల్లోకి తెచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రైతన్నలకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి దూరదృష్టి వల్ల ఇవాళ తెలంగాణలో పంటల దిగుబడి పెరిగి దేశానికే ఆదర్శంగా నిలిచాం అని మంత్రి తెలిపారు.

రైతులు అందరూ ఒకే పంటను వేయడం ద్వారా పంటను అమ్ముకునేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది.అలాంటి పద్ధతికి స్వస్థి పలికి నియంత్రిత పద్దతిలో పంట సాగు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుతున్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే మంచి ధరకు పంటను అమ్ముకోవచ్చు. రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతలా చెప్తున్నాడంటే రైతు క్షేమం కోసమే… ఆయన అలోచన ను పాటిద్దాం. కచ్చితంగా రైతుకు లాభమే జరుగుతుంది మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు రైతులు తమ పంటకు ధరను తామే నిర్ణయించుకుని నచ్చిన ధరకు అమ్ముకునే విధంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనను గౌరవించి,ఆయన సలహాను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్న” అని మంత్రి వేముల అన్నారు. కేసీఆర్ పాలన విధానం నచ్చే వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మెండోరా మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్,ఎంపిపి సుకన్య కమలాకర్, సావెల్ గ్రామ సర్పంచ్ నెళ్ల లింగన్న, నిజామాబాద్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -