బయోడైవర్సీటీ బాధితులను పరామర్శించిన మేయర్

268
ghmc mayor
- Advertisement -

ఇటీవల హైద్రాబాద్ గచ్చిబౌలి లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయాలపాలైన బాధితులకు కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ప్రమాదంలో గాయపడినవారిని నగర మేయర్ బొంతు రాంమోహన్ పరామర్శించారు.

mayor ramohan

ఆయన బాధిత కుటుంబసభ్యులను కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. గాయాలపాలైనవారికి మెరుగైన వైద్య చికిత్సలు నిర్వహించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులను కోరారు. తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్న కుబ్రా భేగంకు వైద్య ఖర్చులు జిహెచ్ఎంసి భరించనున్నట్లు మేయర్ వెళ్లడించారు.

mayor

- Advertisement -