టీడీపీకి మరో షాక్.. బీజేపీలోకి టీడీపీ లోక్‌సభ ఎంపీలు..!

285
TDP
- Advertisement -

టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరనున్న సంగతి తెలిసిందే.ప్రత్యేక వర్గం కొనసాగేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య కు లేఖ సమర్పించారు టీడిపి రాజ్య సభ సభ్యులు. మరోవైపు టీడీపీకి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు ఈ రోజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు.

దీంతో వీరు ముగ్గురు కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే నూతన స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేసిన బిర్లాను అభినందించేందుకే వీరు స్పీకర్ తో భేటీ అయ్యారని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. కానీ, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లేఖను ఇచ్చిన సమయంలో లోక్‌సభ స్పీకర్‌ను ఈ ముగ్గురు ఎంపీలు కలవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

- Advertisement -