బిగ్ బాస్‌ 104 ఎపిసోడ్..కంటెస్టెంట్స్ రీఎంట్రీ!

837
- Advertisement -

బిగ్ బాస్ 3 తెలుగు…మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫైనల్ రేసులో వరుణ్, రాహుల్, శ్రీముఖి, అలీ,బాబా భాస్కర్‌లో ఒకరు విజేతగా నిలవనున్నారు. గెలిచిన వారికి రూ. 50 లక్షల బహుమతి అందనుండగా విజేత ఎవరనేది ఆదివారం తెలియనుంది. ఇక ఫైనల్‌ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్నట్లు సమాచారం. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకోవడంతో శుక్రవారం ఎపిసోడ్‌లో గెస్ట్‌లను తీసుకొచ్చారు బిగ్ బాస్.

ఇంట్లో 103వ రోజు ఉదయం హ్యాపీడేస్ లోని ఓ మై ఫ్రెండ్ పాటతో ఐదుగురు సభ్యులు నిద్ర లేచారు. ఈ క్రమంలో హలో యాప్‌ లక్కీ విన్నర్స్ సుభాష్, ఫణి కుమార్‌లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. వీరు టాప్ 5 కంటెస్టెంట్లతో కాసేపు గడిపారు.

వీరిద్దరు వెళ్లిపోయిన తర్వాత బిగ్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు. తొలుత రవికృష్ణ రాగా హౌస్‌లో ఒక్కసారిగా సందడి మొదలైంది. తర్వాత జాఫర్ ఎంట్రీ ఇచ్చారు. అంతే, బాబా భాస్కర్‌లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది.

big boss3

తర్వాత అషు రెడ్డి, రోహిణి ఎంట్రీ ఇవ్వగానే శ్రీముఖి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. తర్వాత తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇవ్వగా నవ్వుతూ దగ్గరకి వచ్చిన బాబా భాస్కర్.. రంభలా రెడీ అయి వచ్చిందే అంటూ చురక అంటించారు.

ఇక మధ్యాహ్నం భోజనం సమయంలో పునర్నవి, వితికా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పునర్నవవిని రెండు చేతులతో ఒడిసి పట్టుకుని ఎత్తుకున్నాడు రాహుల్. వితికా సైతం భర్త వరుణ్ ను గట్టిగా కౌగిలించుకుని ఎలా ఉన్నవావంటూ యోగక్షేమాలు అడిగింది.

తర్వాత కొద్ది సేపటికి హేమ, హిమజ ఇంట్లోకి అడుగుపెట్టారు. అనంతరం బిగ్ బాస్ అందరినీ లివింగ్ రూమ్‌లో సోఫాలో కూర్చోవాల్సిందిగా సందేశం పంపించారు. తర్వాత ఇంట్లో ఉన్న అందరికీ బిగ్ బాస్ ఒక్కో పత్రాన్ని అందజేశారు. రాత్రి జరిగే అవార్డుల ఫంక్షన్‌కు సంబంధించి ఆ పత్రాల్లో ప్రతి సభ్యుడు ఎవరికీ తెలియకుండా నింపాలని సూచించారు. అనంతరం ఆ పత్రాలను స్టోర్ రూంలో పెట్టేయాలని సూచించారు.

- Advertisement -