పవన్ కళ్యాణ్ ని కలిసిన నితిన్

377
pawan-nithin
- Advertisement -

యంగ్ హీరో నితిన్ రష్మిక మందన జంటగా తెరకెక్కిన చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా..సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈనెల 21న విడుదలైన ఈమూవీ సక్సెస్ పుల్ గా నడుస్తుంది. చాలా రోజుల తర్వాత నితిన్ కు హిట్ వచ్చింది.

 

హీరో నితిన్ తాజాగా తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. చిత్ర ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌తో కలిసి పవన్ ను కలిశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ చిత్ర బృందంతో పాటు నితిన్‌ని అభినందించారు. ఈఫోటోలను ట్వీట్టర్ ద్వారా షేర్ చేశాడు హీరో నితిన్. వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సార్’’ అని నితిన్ ట్వీట్ చేశారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పింక్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చారిత్రాత్మ‌క చిత్రంతో నటిస్తున్నారు.

- Advertisement -