పంత్ స్ధానంలో ఆంధ్రా కీపర్‌ శ్రీకర్ భరత్..!

600
srikar bharath
- Advertisement -

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు పింక్ బాల్‌ టెస్టులో భారత్ పట్టుబిగించింది. బంగ్లాను 106 పరుగులకే కట్టడి చేసింది భారత్. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలిరోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు కొల్పోయి 174 పరుగులు చేసింది.

ఇక ఈ టెస్టులో సాహా కీపర్‌గా తుదిజట్టులో చోటు సంపాదించుకోగా సాహాకి ప్రత్యామ్నాయంగా పంత్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే అనూహ్యంగా ఈ డే/నైట్ టెస్టు నుంచి పంత్‌ను తప్పించి అతని స్ధానంలో ఆంధ్రా కీపర్ శ్రీకర్ భరత్‌ని తీసుకుంది. శనివారం టీమిండియాతో భరత్‌ చేరనున్నాడు.

ఈడెన్ గార్డెన్స్‌ టెస్టు మ్యాచ్‌లో ఇంకా నాలుగు రోజులు ఆట మిగిలి ఉండగా.. సాహా పొరపాటున గాయపడితే అప్పుడు భరత్‌కి మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కనుంది. దులీప్ ట్రోఫీ లో గులాబీ బంతితో ప్లడ్‌లైట్ల వెలుగులో ఆడిన అనుభవం ఉండటం ఇక్కడ భరత్‌కి కలిసొచ్చింది.

Indian selection committee has decided to release Rishabh Pant to get some match time in domestic cricket ahead of the limited overs series against the West Indies next month.

- Advertisement -