భారత్‌పై ఆస్ట్రేలియా గెలుపు..

554
Australia
- Advertisement -

టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. కఠినమైన ప్రత్యర్థి ఎదురైతే ఎలా ఉంటుందో భారత క్రికెట్‌ జట్టుకు తెలిసొచ్చింది. ఇటీవల కాలంలో గణనీయమైన స్థాయిలో విజయాలు సాధిస్తున్న టీమిండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ముంబయి వాంఖెడే స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓడిపోయింది.

ఆసీస్ అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబరుస్తూ 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. భారత్‌ నిర్దేశించిన 256 పరుగుల టార్గెట్‌ను 37. 4 ఓవర్లలోనే కొట్టేసిన ఆసీస్‌.. సిరీస్‌లో శుభారంభం చేసింది. వార్నర్‌ 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 128 పరుగులతో అజేయంగా నిలవగా, ఫించ్‌ 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

బుమ్రా, షమీ, ఠాకూర్, కుల్దీప్, జడేజా వంటి బౌలర్లు సైతం వార్నర్, ఫించ్ ముందు సాధారణ బౌలర్లుగా మారిపోయారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. రెండో వన్డే జనవరి 17న రాజ్ కోట్ లో జరగనుంది.

- Advertisement -