బీజేపీ కార్యాలయానికి జైట్లీ పార్థివదేహం..

204
Arun Jaitley
- Advertisement -

గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(66) నిన్న (శనివాం) తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో శనివారం మధ్యాహ్నం 12.01 గంటలకు తుదిశ్వాసవిడిచారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ నుండి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని కైలాష్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు.

jaitley

అనంతరం ఆదివారం నాడు అభిమానులు, కార్యకర్తల సందర్శనార్ధం అరుణ్‌జైట్లీ పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా జైట్లీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

- Advertisement -