మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్..

332
indian-police
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ లను ఉపసంహరించారు. శనివారం రాత్రి హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఆర్ కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు మంత్రులందరికీ 2+2 చొప్పున భద్రత వ్యవస్థ ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన తరువాత కూడా ఇదే రక్షణను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మాజీలకు రక్షణ ఉపసంహరించుకున్న నేపథ్యంలోనే ఈ జిల్లాలో తాజాగా నిర్ణయాన్ని అమలు చేశారు. దీంతో జిల్లాలోని 14 మంది మాజీ ఎమ్మెల్యేలకు గన్ మెన్లను తొలగించారు. మొత్తం 32 మంది గన్‌మెన్లను వెనక్కి పిలిచారు.

- Advertisement -