సీఎం కేసీఆర్‌తో జగన్‌ సమావేశం..

479
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి.అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్‌ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ భేటీలో పాల్గొన్నారు.

kcr

 

ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాల అజెండాను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు. అనంతరం ఈ సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి జెరూసలేం పర్యటనకు జగన్ వెళ్లనున్నారు.నాలుగు రోజుల పాటు జెరూసలేంలో పర్యటించనున్నారు. 5వ తేదీ మధ్యాహ్నానికి అమరావతి చేరుకుంటారు. 6వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

MP santhosh

cm kcr

 

- Advertisement -