తండ్రిని ఫాలో అవుతున్న జగన్..అప్పుడు సబితా, ఇప్పుడు సుచరిత

267
YSr Jagan
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొన్ని విషయాల్లో మాత్రం జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోం మంత్రి పదవి మహిళకు కేటాయించారు. చేవెళ్ల చెల్లెమ్మగా పేరున్న సబితా ఇంద్రారెడ్డి ఆయన హోం మంత్రి పదవి ఇచ్చారు.

Sabitha Sucharita

ఇప్పుడు జగన్ కుడా తన క్యాబినెట్లో ఓ మహిళకు హోం మంత్రి పదవి కట్టబెట్టారు. తొలి నుండి తన వెంట నడిచిన వారికి మంత్రివర్గంలో వైఎస్ జగన్ పెద్దపీట వేశాడు. పార్టీ కోసం కష్టనష్టాలను ఓర్చుకొని పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. కాంగ్రెస్ పార్టీని వీడి మొదటి నుండి నడిచిన సుచరితకు హోం మంత్రి పదవిని కట్టబెట్టారు సీఎం జగన్.

- Advertisement -