ముగ్గురు పెళ్లాలు..ఐదుగురు పిల్లలు..పవన్‌పై జగన్ సెటైర్

489
jagan
- Advertisement -

జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఘాటు సమాధానం ఇచ్చారు. సోమవారం అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్..పవన్‌పై సెటైర్ విసిరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింనందుకు విమర్శలు చేస్తున్న వారంతా వాళ్ల పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఎక్కడ చదువుతున్నారు,ముగ్గురు పెళ్ళాలు , నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు అంటూ జగన్ ప్రశ్నించారు.

ప్రపంచ స్థాయి కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, వెంకయ్య, నటుడు పవన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -