ఆగస్టు 15న అమెరికాకు సీఎం..

477
Ap cm ys jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 15, గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళుతున్నారు. 15న విజయవాడ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆయన, అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని, రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లనున్నారు. తిరిగి 24వ తేదీ రాత్రి తాడేపల్లికి తిరిగి వస్తారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

సీఎం చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. 17న డల్లాస్‌లోని కే బెయిలీ హచిసెన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -