కార్తికేయ 2లో రాక్షసుడు భామ..!

756
anupama
- Advertisement -

విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ . గతంలో డైరెక్టర్‌ చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిఖిల్ సరసన హీరోయిన్‌గా రాక్షసుడు భామ అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్లు సమాచారం. ఇందుకు అనుపమ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ – వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తుండగా చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు.

- Advertisement -