ఆర్ఆర్ఆర్..మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..!

506
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతుండగా తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది.

సినిమాలో అల్లూరి సీతారామరాజు,కొమరం భీంలు మూవీలో అనుకోకుండా కలుస్తారట. ఈ మూవీలో ఇదే ట్విస్ట్ కానుందని సమాచారం. అయితే నిజజీవితంలో వీరు కలుసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు 1897లో జన్మించి మన్యంలో పోరాటం చేస్తూ 1924లో మరణించారు. ఇక 1901లో కొమరం భీమ్ తెలంగాణలో జన్మించారు. 1940లో మరణించగా వీరిద్దరిని జక్కన్న ఎలా ఎక్కడ కలిపారు అన్నది ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది వైరల్‌గా మారుతోంది. ఇక మొత్తంగా జక్కన్న తెరకెక్కించే ఈ బిగ్ మల్టీస్టారర్ ఎలా ఉండనుందో తెలియాలంటే 2020 జులై 30 వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -