చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీ సతీష్..!

322
annam sathish
- Advertisement -

గత కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పలువురు కీలక నేతలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. టీడీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం. గుంటూరు జిల్లా టీడీపీలో ఆయన కీలక నేత ఉన్నారు. బాపట్ల టీడీపీలో అన్నం సతీష్ తిరుగులేని నేతగా ఎదిగారు.

2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు. సతీష్ కృషిని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మండలికి పంపారు. అయితే ఆయన ఇప్పుడు టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

- Advertisement -