మరోసారి వివాదంలో ఇరుక్కున్న యాంకర్ రవి..ఈసారి జగన్ టార్గెట్

748
anchor ravi
- Advertisement -

బుల్లితెర యాంకర్ రవి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఆయనపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవి క్షమాపణలు చేప్పాల్సేందనని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే గత నెలలో ‘పటాస్’ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా మహిధర్ అనే కంటెస్టంట్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

ఆ సమయంలో రవి క్లాప్స్ కొడుతూ స్టేజ్ పైకి వెళ్లాడు. దీంతో అతడి వ్యవహారశైలి సదరు కంటెస్టంట్ ని సపోర్ట్ చేసినట్లుగా ఉండడంతో ఏపీ ప్రజలు రవిని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేస్తున్నారు. దీంతో రవి స్పందించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశాడు.

ఏపీ, తెలంగాణా వేర్వేరు కాదని.. రెండు రాష్ట్రాల ప్రజలు సమానమేనని చెప్పారు. గత నెలలో జరిగిన షోలో కంటెస్టంట్ మహిధర్ చేసింది తప్పేనని ఆ విషయాన్ని ‘పటాస్’ ఒప్పుకుంటుంది..నేను కూడా ఒప్పుకుంటున్నానని అన్నారు. ‘మహిధర్’ క్షమాపణలు కూడా చెప్పాడని.. ఆ సమయంలో నేను అతడిని సపోర్ట్ చేయలేదుని యాంకర్ గా అక్కడ అలానే ప్రవర్తించాలని అన్నారు. దయచేసి ఈవివాదంలోకి తనను లాగొద్దని రిక్వేస్ట్ చేశారు.

- Advertisement -