మావోయిస్ట్ సమస్యలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

284
Mavoist Jagan
- Advertisement -

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . మావోయిస్ట్ సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అధ్యక్షతన ఈ సబ్ కమిటీ పనిచేస్తోంది. కేబినెట్ సబ్‌ కమిటీలో హోంశాఖ, రెవెన్యూ శాఖ, గిరిజన సంక్షేమశాఖ, ఆర్ అండ్ బీశాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు.

రాష్ట్రంలో లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం కల్పించడంపై దృష్టిసారించనుంది కేబినెట్ సబ్ కమిటీ. లొంగిపోయిన నక్సల్స్ పునరావాసం, తీవ్రవాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపులో విధాన రూపకల్పన, ధ్వంసం అయిన ఆస్తులకు పరిహారం తదితర అంశాల్లో మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించనుంది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -