రష్మీ సంచలన నిర్ణయం..ఇక సినిమాలకు గుడ్ బై

347
Anchor Rashmi Gautham
- Advertisement -

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ యాంకర్లలో రష్మీ కూడా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యాంకరింగ్ తో పాటు అమ్మడు అప్పుడప్పుడు వెండితెరపై హీరోయిన్ గా కూడా నటిస్తుంది. పలు చిన్న సినిమాలు రష్మీ హీరోయిన్ గా నటించింది.

కానీ ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. ఆమె యాక్టింగ్ బానే ఉన్నా సరైన పాత్రలు ఎంచుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో వెండితెరపై హీరోయిన్ గా రాణిద్దామనుకున్న రష్మీ ఆశలన్ని అడియాశలయ్యాయి. అందుకే రష్మీ ఇక నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని నిర్ణయం తీసుకుందట.

ఒకవేళ మంచి కథలు వస్తే తప్ప సినిమాల జోలికి వెళ్లవద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు రష్మీ గౌతమ్.. టీవీ షోస్‌తో పాటు వెబ్ సిరీస్‌లో నటించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. సినిమాల్లో అయితే సెన్సార్ ఉంటుంది…కానీ వెబ్ సిరీస్ విషయంలో అలాంటి హద్దులే ఉండవు.. పైగా అందరికీ ఈజీగా చేరువయ్యే అవకాశం ఉండటంతో రష్మీ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -