గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి..

398
- Advertisement -

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి.. భూపాలపల్లి జనరల్ మేనేజర్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెన్ కో,ఏఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

Prabhakar reddy

ఇందులో భాగంగా మరో ముగ్గురికి సిద్దయ్య కెటిపిపి సీఈ, ఎమ్మార్వో శ్రీనివాస్ తాడిచెర్ల, ఎస్సై నరేష్ కొయ్యుర్‌లకు ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం భావితరాలకు చాలా ఉపయోగకరమైనది, సంతోష్ కుమార్ పేరుతో త్వరలో నర్సరీ ప్రారంభిస్తామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -