కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు-అల్లు అర్జున్

223
Allu Arjun
- Advertisement -

శనివారం కేరళలోని అలప్పుఝా వద్ద ఉన్న పున్నామ్ద సరస్సులో జరిగిన ప్రతిష్టాత్మక 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఆయన సతీమని అల్లు స్నేహారెడ్డితో కలిసి హాజరయ్యారు. కేరళ ప్రజలు తమ అభిమాను హీరోకు కొచ్చి ఎయిర్ పోర్ట్ నుంచే గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మల్లూవుడ్‌లో అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ పళనిసామి సదాశివం హాజరయ్యారు. ఆయనతో కలిసి అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Allu Arjun

‘నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌’‌ వద్ద బన్నీ జెండా ఎగురవేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకోవడమే కాకుండా తనకు ఇంత గొప్ప గౌరవాన్ని కల్పించిన కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కి నన్ను ఆహ్వానించి.. జెండా ఎగురవేసే అవకాశం కల్పించినందుకు కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నాకు ఇంత గొప్ప గౌరవాన్నిచ్చినందుకు కేరళ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని బన్నీ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

- Advertisement -