తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బన్నీ..

523
allu arjun
- Advertisement -

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంప‌తులు ఈ రోజు ఉద‌యం శ్రీనివాసుడిని ద‌ర్శించుకున్నారు. అల.. వైకుంఠపురములో సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో భార్య స్నేహారెడ్డితో కలిసి బన్నీ తిరుమలను సందర్శించి పూజలు నిర్వహించారు. అలాగే చిత్ర బృందం కూడా ఈ క్రమంలో తిరుమ‌ల‌కి చేరుకొని మొక్కుని చెల్లించుకున్నారు.

allu arjun family

బన్నీ ఫ్యామిలీతో పాటు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, నిర్మాతలు రాధాకృష్ణ‌, బ‌న్నీవాసు కూడా ఉన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు వారికి శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -