తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విప్ గొంగిడి సునీత

714
Gongidi Sunitha
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈరోజు ఉదయం విరామ సమయంలో భర్త మహేందర్ రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలకు వెళ్లిన విప్ సునీతకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం, స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం, ఆలయ రంగనాయకుల మండపంలో సునీత దంపతులకు.. వేదపండితులు ఆశీర్వచనం అందిచగా.. అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్ర్తాలు అందజేశారు. విప్ సునీత మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ది చెందుతుందని చెప్పారు.

- Advertisement -