అల్లు అభిమానులకు ‘గీతాఆర్ట్స్’ పిలుపు..!

739
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది.

ala-vikuntapuramlo

తాజాగా, ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా నిడివి 165 నిమిషాలు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ఓ పెద్ద కుటుంబంలా సంక్రాంతి వేడుక చేసుకుందాం అంటూ గీతా ఆర్ట్స్ తన ట్వీట్‌లో అభిమానులకు పిలుపునిచ్చింది.

ఇక ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్స్‌ ‘సామజవరగమన’,’రాములో రాముల’ అనే పాటలు విడుదలైనపటినుండి సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నవైనం ఈ పాటల సొంతం. ఈ చిత్రంలో థమన్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి.

- Advertisement -