- Advertisement -
అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ అల వైకుంఠపురములో. 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్,టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా జనవరి 6న నిర్వహించనున్నట్లు సమాచారం. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా అతిథిగా ఎవరు రానున్నారనే వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.
ఎస్ రాధాకృష్ణ- అల్లు అరవింద్ నిర్మిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుండగా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తాచాటాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటి టబు కీ రోల్ పోషిస్తున్నారు. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
- Advertisement -