కమెడీయన్ పృధ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్..

384
Actor Prudhvi
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ కమెడీయన్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా కమెడీయన్ పృధ్వీ వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో కూడా పృధ్వీ వైసిపి అభ్యర్దుల తరపున ప్రచారం కూడా చేశారు. దీంతో పృధ్వీకి కీలకమైన పదవిని కట్టబెట్టారు జగన్.

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా సినీ నటుడు పృథ్వీని  నియమించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే పృథ్వీకి సీఎం వైఎస్ జగన్ సమాచారం ఇవ్వగా త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇటీవలే ఎస్‌వీబీసీ చైర్మన్‌ పదవికి సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు రాజీనామా చేశారు.

ఆయన స్థానంలో పృథ్వీని నియమించనున్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ ఏపీ మొత్తం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే . పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పృథ్వీ తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెల్లి స్వామివారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించిన విషయం తెలిసిందే

- Advertisement -