అభిమన్యు మిథున్ సంచలనం… ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

587
abhimanyu mithun
- Advertisement -

పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో ఏదైనా సాధ్యమే. భారీ టార్గెట్‌ను చేధించడం,బంతితో మ్యాజిక్ చేయడం ఇలా క్రికెట్ ఫ్యాన్స్‌ ఇప్పటివరకు థ్రిల్‌కు గురికాగా తాజగా అలాంటి సంచలనమే జరిగింది. భారత బౌలర్ అభిమన్యు మిథున్‌ టీ20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఏకంగా ఆరు బంతుల్లో ఏకంగా 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ సెమీఫైనల్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదైంది. హర్యానాతో జరిగిన సెమీస్‌ చివరి ఓవర్‌లో తొలి మూడు బంతులకు మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేసిన మిథున్‌.. నాలుగో బంతికి మరో వికెట్, ఆరో బంతికి ఇంకో వికెట్ తీసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో కర్ణాటక జట్టు 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి ఫైనల్‌కి దూసుకెళ్లింది.

Karnataka-Haryana Syed Mushtaq Ali T20 semis clash, the spotlight was on former India pacer Abhimanyu Mithun as it had emerged

- Advertisement -