నిద్ర లేమితో నష్టాలు..

344
- Advertisement -

నిద్ర మనిషికి ఎంతో ముఖ్యం. నిద్ర తగ్గితే మనం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సివస్తుంది. కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర… ఈ రెండింటిలో దేనిలోనైనా తేడా వస్తే మనిషి అనారోగ్యం పాలవుతాడు. పరిస్థితి విషమిస్తే మరణానికి దగ్గరవుతాడు. తిండి తినకుండా 20 నుంచి 40 రోజుల వరకు ఉండొచ్చు కానీ నిద్ర పోకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండటం అసాధ్యం. ఒక్కరోజు సరిగా నిద్రలేకుంటే పని చేస్తున్నప్పుడు మధ్యలోనే కునుకుపాట్లు, తలనొప్పి ముంచుకొస్తుంటాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల సర్వే ప్రకారం ఓ మనిషి నిద్రపోకుండా 264 గంటలు.. అంటే 11 రోజుల పాటు ఉండగలడట. అంతకుమించితే చావును చూడాల్సి వస్తుందని సర్వే చేసిన వారు తేల్చిచెప్పారు. అయితే నిద్ర త‌క్కువ‌గా పోతే ఎలాంటి ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read:ఇప్పుడు బాలయ్య వంతు.. గెట్ రెడీ!

  • నిద్ర త‌గ్గితే శృంగారంలో స‌రిగ్గా పాల్గొన‌లేర‌ని, డిప్రెష‌న్ బారిన ప‌డ‌తార‌ని, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంద‌ని, వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌రగా వ‌స్తాయ‌ని కూడా వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక ఎవ‌రైనా స‌రే.. నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.
  • రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోతే గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు.
  • రోజూ నిద్ర త‌క్కువ‌గా పోతే ప‌నిచేసే ఉద్యోగుల్లో చురుకుదనం పోతుంద‌ట‌. అలాగే యాక్టివ్‌గా ప‌నిచేయ‌లేర‌ట‌. దీంతోపాటు డ్రైవింగ్ చేసేట‌ప్పుడు నిద్ర వ‌చ్చి యాక్సిడెంట్లు అయ్యేందుకు కూడా అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.
  • నిద్ర త‌క్కువ‌గా పోవ‌డం వ‌ల్ల ఏకాగ్ర‌త కోల్పోతామ‌ని వైద్యులు చెబుతున్నారు. అలాగే ప‌ని చేయాల‌న్నా విసుగు చెందుతామ‌ట‌.
  • నిద్ర త‌గ్గితే అధికంగా బ‌రువు పెర‌గ‌డంతోపాటు డ‌యాబెటిస్ కూడా వ‌స్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.
- Advertisement -