బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు..

279
- Advertisement -

టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ముగ్గురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. అనారోగ్య కారణంగా ఎంపీ గరికపాడి మోహన్‌రావు వీరితో పాటు నేడు బీజేపీలో చేరలేదు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారు. కాసేపటి క్రితమే టీడీపీని వీడుతున్నట్లు పేర్కొంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నలుగురు ఎంపీలు సంతకాలు చేసి లేఖ అందజేశారు. మొత్తం ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో టీడీపీకి మిగిలింది ఇక ఇద్దరు ఎంపీలు మాత్రమే.

bjp

- Advertisement -