30 రోజుల ప్రణాళిక విజయవంతం: సీఎం కేసీఆర్

539
cm kcr
- Advertisement -

గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యచరణతో జరిగిన పల్లె ప్రగతి దిగ్విజయం అయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని గ్రామాల్లో పవర్ వీక్ నిర్వహించి విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అద్భుతంగా పనిచేసి నెంబర్ 1గా నిలిచిందన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు,కలెక్టర్లతో పాటు అధికారులందరికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని పిలుపు నిచ్చారు. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ. 339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు,కలెక్టర్లు,వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -