నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు…ముందుగా మోదీ ప్రమాణం

319
Indian-Parliament
- Advertisement -

ఇవాల్టీ నుంచి 17వ లోక్ సభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10గంటలకు ఈసమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొదట బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్ తో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ఇవాళ , రేపు రెండు రోజులు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనుంది. ఇక పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని కోరారు ప్రధాని మోదీ. ఇక పార్లమెంట్ లో ముందుగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులు, ప్యానల్‌ ఛైర్మన్లు ఎంపీలుగా ప్రమాణం చేస్తారు. తర్వాత ఆంగ్ల అక్షరమాల వరుస క్రమంలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.

- Advertisement -