ఉత్తమ్‌కు హరీశ్‌ బహిరంగలేఖ

246
harish rao
- Advertisement -

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌కు బహిరంగ లేఖ రాశారు మంత్రి హరీష్‌ రావు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన హరీష్‌…కాంగ్రెస్,టీడీపీ వైఖరిని ఎండగట్టారు. మహాకూటమి పొత్తు స్వప్రయోజనమో…రాష్ట్ర ప్రయోజనమో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అడగడుగున తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడిన చంద్రబాబు పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు.

తెలంగాణను కేసీఆర్ నిలబెట్టాలనుకుంటే చంద్రబాబు పడగొట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ నేరుగా వస్తే తెలంగాణలో డిపాజిట్లు దక్కవనే చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నాడని మండిపడ్డారు.టీఆర్ఎస్‌తో కలిసి ఉద్యమించిన కోదండరాం తెలంగాణ వ్యతిరేకులతో కలవడం అమరవీరుల ఆత్మలకు ద్రోహం చేయడం కాదా ? అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడతారా అని 12 ప్రశ్నలను మహాకూటమి నేతలకు సంధించారు.

()మీది షరతులతో కూడిన పొత్తా? సిగ్గులేని పొత్తా స్పష్టం చేయలి…
()పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్దని బాబు కేంద్రానికి 30 లేఖలు రాశారు. బాబు వైఖరి మార్చుకుని మళ్ళీ కేంద్రానికి లేఖ ఇచ్చారా?
()కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖను బాబు వాపసు తీసుకున్నారా?
()రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కూడా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అదేమైనా మార్చుకున్నా అని టీడీపీ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారా?
()తెలంగాణ వ్యతిరేక వైఖరి వీడానని బాబు హామీ ఇచ్చారా? పోలవరం ఏడు మండలాలు తిరిగి ఇచ్చేస్తామని బాబు హామీ ఇచ్చారా?
()పోలవరం డిజైన్ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా?
() కృష్ణా, గోదావరి జలాల్లో వాటాకు సంబంధించి ట్రిబ్యునళ్లలో జరుగుతున్న వాదనల విషయంలో చంద్రబాబు వైఖరి మార్చుకుంటున్నారా?
() బీజేపీ మద్దతుతో 460 మెగావాట్ల సీలేరు హైడెల్ కేంద్రాన్ని బాబు లాక్కున్నారు. దాన్ని తెలంగాణకు బాబుతో తిరిగి ఇప్పిస్తారా?
()త్రిశంకు స్వర్గంలో ఉన్న 1350 మంది ఉద్యోగులను ఏపీ తీసుకోవడానికి బాబును ఒప్పిస్తునారా?
()నిజాం వారసత్వంగా తెలంగాణకు సంక్రమించాల్సిన ఆస్తులపై బాబు వాదన ఏమైనా మార్చుకున్నారా?.
()హైకోర్టు, మిగతా విభజన హామీలపై బాబుతో హామీ తీసుకున్నారా?.
()తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల కృష్ణా జలాలను బాబు రాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ మీద మేము పోరాడుతున్నాం. తెలంగాణకు నీళ్లు వద్దంటున్న బాబుతో నీళ్లు ఇప్పిస్తామని
చెప్పించగలరా?
() చంద్రబాబు తెలుగు జాతి అని మాట్లాడుతుంటారు. అది ఆయనకు అతకదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు ఉంటే మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లిచ్చే ప్రాజెక్టును బాబు
వ్యతిరేకిస్తున్నారు. దానిపై ఆయన వైఖరి మారిందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -