రాహుల్ గాంధీకి కర్ణాటకలో చేదు అనుభవం

168
rahul-gandhi
- Advertisement -

కర్ణాటక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీకి చేధు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షుడై ఉండి కనీసం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై అవగాహన లేకపోవడంతో రాహుల్ చిక్కుల్లో పడ్డారు.

rahul gandhi

కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీతో ఓ మహిళ ఒక అంశాన్ని లేవనెత్తింది. లింగాయత్లను ఎందుకు ప్రత్యేక మతం అంటూ సమజాన్ని, ప్రజలను విడదీస్తున్నారని ప్రశ్నించింది. ఈ అంశంపై తనకు అవగాహన లేదంటూ ప్రక్కనే ఉన్న సీఎం సిద్దారామయ్యను చెప్పాల్సిందిగా కోరారు. లింగాయత్ సాధువులు చేసిన డిమాండ్ మేరకే తాము కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు మాత్రమే పంపించామని సిద్దారామయ్య సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

కర్ణాటకలో ఎన్నికల ముందు బీజేపీపై పైచేయి సాధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే హడావిడిగా లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించడానికి తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. సొంత ప్రభుత్వం ఇంత కీలకమైన అంశంపై తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ తనకు అవగాహన లేదని చెప్పడం విమర్శలకు దారి తీసింది.

- Advertisement -