పరువు తీస్తున్న యాంకర్లు….

181
- Advertisement -

యాంకర్లకు అందం, చలాకీ తనం, గలగల మాట్లాడడం, ఇవి మాత్రమే సరిపోవు. కాస్త భాష మీద పట్టు, సమయస్ఫూర్తి ఉండాలి. లేకపోతే వేదికలపై వెలవెలపోవాల్సి వస్తుంది. కేరళ అమ్మాయి అయినా.. సుమ కనకాల కెరియర్ ప్రారంభం నుంచి తెలుగును, సమయస్ఫూర్తిని వేదికలపై చాలా బాగా ప్రదర్శస్తుంది. అయితే అచ్చ తెలుగు యాంకర్లు మాత్రం వేదికలపై పరువుతీస్తున్నారు. అత్యుత్సాహంతో నోరు జారాక.. తిరిగి తీసుకోలేం కదా.

స్వర దిగ్గజం ఉన్న వేదికపై యాంకర్ ఝాన్సీ కూడా ఇలాంటి తప్పిదమే చేసింది.తిరుపతిలో ప్రముఖ సినీ గాయకుడు ఏసుదాసుకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసుదాసు గురించి చెపుతూ..అమర గాయకుడు ఏసుదాసు గారు అంటూ సంబోధించింది ఝాన్సీ. దీంతో కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. అయితే ఝాన్సీ మాత్రం తప్పు తెలుసుకున్నా.. ఆగకుండా తన యాంకరింగ్ కొనసాగించింది. రీసెంట్ గా మజ్ను ఆడియో వేడుకలోనూ ఝాన్సీ ఇలాగే అందరిని ఇబ్బంది పెడుతూ, తాను ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం కారణంగా ఇప్పుడు ఝాన్సీ, సుమను కంపేర్ చేస్తూ.. ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -