జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా..?

270
YS Jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వలేదు. కానీ వైసీపీ నేతలు గెలుపు తమదేనని కొండంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిపోతాడని. బెట్టింగ్ రాయుళ్ళు కూడా జగన్ పైనే ఎక్కువగా బెట్టింగులు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జ్యోతిష్యులు కూడా జగనే ముఖ్యమంత్రి అని తేల్చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచేది జగనే అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇదిలావుండగా జగన్ ఈ నెల 22వ తేదీన ఉండవల్లికి తన పూర్తిగా మకాం మారుస్తున్నారు. దానికి ముందే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయం అమరావతి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు. తాను అధికారంలోకి వస్తాననే ధీమాతోనే ఆయన ఈ తరలింపు కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

YS Jagan

కాగా, వైసిపి గెలిస్తే జగన్ ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతూ వస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నాడీ జ్యోతిష్కుడు కాళిదాస్ ఆ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు ప్రచారం సాగింది. అయితే, అందులో నిజం లేదని వైసిపి వర్గాలంటున్నాయి.

YS Jagan

వాస్తవానికి వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఆ ముహుర్తాన్ని విశాఖకు చెందిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామి పెట్టినట్లు తెలుస్తోంది. వైయస్‌ జగన్‌కు స్వరూపానందేంద్ర స్వామి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ జగన్‌ సీఎం అవుతారా.. ఈ ముహుర్తానికే ప్రమాణ స్వీకారం చేస్తారా.. తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

- Advertisement -