వెంకయ్య మెచ్చిన మహర్షి..

486
venkaiah naidu maharshi
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహర్షి. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన మహర్షి విడుదలైన ప్రతిచోటా భారీ వసూళ్లను రాబడుతోంది. సినీ,రాజకీయాలకు అతీతంగా మహర్షి మూవీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

తాజాగా మహర్షి సినిమాపై ప్రశంసలు గుప్పించారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసిన ఆయన ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది అన్నారు. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం మహర్షి అని ట్వీట్ చేశారు.

గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకుతెచ్చింది. సహజమైన నటన కనబరిచిన మహేశ్‌ బాబుకు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు వంశీ పైడిపల్లికి, నిర్మాతలతో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వెంకయ్య ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన మహేష్ బాబు,వంశీ పైడిపల్లి ధన్యవాదాలు తెలిపారు. మీ మాటలు మాకు స్పూర్తినిచ్చాయని రైతు సమస్యల నేపథ్యంలో మరిన్ని సినిమాలు తీసేందుకు దోహదపడతాయని మహేష్ పేర్కొన్నారు.

- Advertisement -