సీఎం కేసీఆర్‌కి కేంద్రమంత్రి ప్రశంసలు

197
Union Minister Praises KCR
- Advertisement -

సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి రాందాస్ ప్రశంసలు గుప్పించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయని కితాబిచ్చారు.సీఎంగా కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని కేంద్రమంత్రి రాందాస్ మెచ్చుకున్నారు. . రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. 10 లక్షల 40 వేల మంది వికలాంగులు తెలంగాణాలో ఉన్నారని ఆయన తెలిపారు. ఆర్ధికంగా వెనక బడిన అన్ని కులాలు రిజర్వేషన్లు అడుగుతున్నాయని, ఈ విషయమై కేంద్రానికి నివేదికలు, తీర్మానాలు సమర్పించామని మంత్రి తెలిపారు.

భారతదేశ వ్యాప్తంగా అత్యాచారాలు తగ్గాలంటే కులాంతర వివాహాలే ఏకైక మార్గమని కేంద్రమంత్రి రాందాస్ చెప్పుకొచ్చారు. అత్యాచారాలు పెరగటానికి రిజర్వేషన్లే కారణమని వ్యాఖ్యానించారు. కులాంతర వివాహాలు పెరిగితే అత్యాచారాలు తగ్గుతాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో యూపీ మొదటి స్థానంలో, తెలంగాణ 5వ స్థానంలో ఉందని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

కర్ణాటకలో జర్నలిస్ట్ హత్యను కేంద్రమంత్రి రాందాస్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో బీజేపీ పై విమర్శలు చేయటం బాధాకరమన్నారు.

- Advertisement -