అంబేద్కర్ తత్వంతో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారుః కేటీఆర్

285
ktr
- Advertisement -

అంబేద్కర్ తత్వంతో కేసీఆర్..తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గోన్న ఆయన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ అనగానే ఒక వర్గానికి చెందిన నాయకుడు అనడం సరికాదు… ఆయన అందరి నేత అన్నారు. మైనార్టీల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుచేశారు.

అంబేద్కర్ చొరవతో పార్లమెంట్ లో బిల్లుతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు. అంబేద్కర్ తత్వం భారతదేశానికి ఇప్పుడు ఎంతో అవసరం ఉందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… అంబేద్కర్ కొందరి నాయకుడు కాదు.. అందరి నాయకుడని.. అల్పసంఖ్యాకులకు ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నారు. నిన్న పంజాగుట్టలో జరిగిన ఘటన బాధాకరమన్నారు కేటీఆర్. బాధితులపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందన్నారు.

- Advertisement -