స్థానిక ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌దే గెలుపు-కేటీఆర్‌

250
TRS Working President KTR
- Advertisement -

ఇటీవల లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఇంతలో మళ్లీ ఎన్నికల నగార మోగింది. త్వరలో పదవీకాలం ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.

TRS Working President KTR

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల జడ్పీ పీఠాలే లక్ష్యంగా పని చేయాలి. పార్టీ శ్రేణులకు సోమవారం సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేస్తారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తాం. మొత్తం 32 జిల్లాలకు 32 జెడ్పీ చైర్మన్ పీఠాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లో నిరాశ తప్పదు. గత నెలరోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించినం. ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారు. వారం, పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలి. ప్రజా ప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకునేలా ముందుకు పోతామన్నారు కేటీఆర్.

- Advertisement -