ప్రిన్స్ మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మరోసారి రాబోతుంది. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అతడు,ఖలేజా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టలేకపోయిన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో త్రివిక్రమ్ డైలాగ్లు,మహేష్ నటనకు యూత్ ఫిదా అయ్యారు.
తాజాగా మరోసారి ఈ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్టు రాబోతుంది. మహేశ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఓ ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్కు సంబంధించిన షూట్ జరుగుతోంది. ఈ ప్రకటనను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో కలిసి దిగిన ఫొటోను మహేశ్ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.నా ఫేవరేట్తో మరోసారి. ఆయనతో కలిసి పనిచేస్తే కలిగే అనుభూతి నాకెప్పుడూ నచ్చుతుంది అని ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారింది. 31వేలకు పైగా లైక్లు రాగా మరోసారి వీరిద్దరూ కలిసి వెండితెరపై సందడి చేయాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.ఇక మహేష్ ప్రస్తుతం నటించిన మహర్షి మేలో విడుదల కానుంది.
Back with my favourite 😎
Love the experience…always 😊 pic.twitter.com/RwG7kFXVAs— Mahesh Babu (@urstrulyMahesh) April 10, 2019