దాసరి మృతిపై అనుమానాలున్నాయి !

323
susheela-doubts-dasaris-death
- Advertisement -

టాలీవుడ్ పెద్దన్న.. దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇక లేరని .. తిరిగి రారన్న విషయాన్ని తెలుగు పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఈ సందర్భంలో ఆయన కుటుంబంలోని వివాదాలను తెరపైకి తీసుకువచ్చారు పెద్ద కోడలు సుశీల. దాసరి అంత్యక్రియలు పూర్తై 24 గంటలు కూడా గడవకముందే… ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు సుశీల.

హైదరాబాదులో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ‘‘మా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే… అయితే ఇంకా నాకు, నా భర్తకు విడాకులు కాలేదు. అసలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా? అనారోగ్యం పాలయ్యారు?… గతంలో నేను వచ్చినప్పుడు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశాను. ఆయన ఆసుపత్రిలో ఉండగా పరామర్శించేందుకు వస్తే… నన్ను కనీసం ఆయనను చూసేందుకు కూడా అనుమతించ లేదు. అప్పుడే అనుమానాలు వచ్చాయి. మొన్న మే 4న మామగారిని చూసేందుకు వెళ్తే…ఆయన ప్రేమగా మాట్లాడారు.

Dasari Narayana rao family

తన కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని మాటిచ్చారన్న సుశీల…మరోక చిన్న ఆపరేషన్ ఉంది… రెండు వారాలు ఆగి రండని.. కూర్చుని మాట్లాడుకుందామని కూడా దాసరి చెప్పారని తెలపింది. మాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు. దీనిపై మాట్లాడుతూ, ‘ఎంతో మందికి జీవితాలిచ్చాను.. మీకు అన్యాయం చేయను. రెండు వారాల తర్వాత రండి, తప్పకుండా న్యాయం చేస్తా’నని ఆయన అన్నారు. అంతేకాదు ‘నా మనవడిని నాతోనే ఉంచుకుంటా’నని ఆయన చెప్పారు. అలాంటి ఆయన ఇంత హఠాత్తుగా మృతి చెందడమేంటి? ఆయన మృతిపై నాకు అనుమానాలున్నాయి’’ అని ఆమె ఆరోపించారు.

అయితే కుటుంబ తగాదాలు ఉంటే ఉండొచ్చుకాని ఇలాంటి సందర్భంలో ఆస్థిగొడవలను తెరపైకి తీసుకురావడంపై దాసరి ఆత్మీయులు మండిపడుతున్నారు. కాగా, దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు తారక ప్రభు భార్యే సుశీల. అయితే తారకప్రభుతో సుశీలకు విభేదాలు ఉండటంతో ఆయనకు దూరంగా ఉంటున్నారు. గతంలో తారక ప్రభుపై వరకట్న కేసుకూడా నమోదు కావడంతో అప్పట్లో సంచలనంగా మారింది ఈ కేసు. అయితే ఆ తరువాత ఈ గొడవను దాసరి సెటిల్ చేశారని ప్రస్తుతానికి ఏలాంటి వివాదాలు లేవని తెలుస్తోంది.

- Advertisement -