మారుతి దర్శకత్వంలో సాయి తేజ్

290
maruthi Sai Tej
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ప్రేమకథ చిత్రాల స్పెషలిస్ట్ కిషోర్ తిరుమల ఈచిత్రానికి దర్శకత్వం వహించగా..మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మించారు. సాయి ధరమ్ తేజ్ సరసన నివేధా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. సాయి ధరమ్ తేజ్ పేరుతో హిట్లు రావడం లేదని ఆయన పేరును సాయి తేజ్ గా మార్చుకున్నాడు.

పేరు మార్చుకున్నాక ఆయనకు పెద్ద హిట్ రావడంతో ఇక ముందు కూడా ఇదే పేరును కంటిన్యూ చేయనున్నాడు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం సాయి తేజ్ తర్వాతి మూవీ మారుతి దర్శకత్వంలో చేయనున్నాడని తెలుస్తుంది. మారుతి చివరగా నాగ చైతన్యతో శైలజరెడ్డి అల్లుడు సినిమా తీశాడు. ఈమూవీ అనుకున్నంత ఆడకపోవడంతో ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు.

ఇటివలే సాయి తేజ్ కు ఓ కథను వినిపించాడట. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయి తేజ్. ఈమూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వుండనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

- Advertisement -