‘మహర్షి’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

313
Maharshi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం మహర్షి. ఈమూవీలో పూజా హెగ్డె కథానాయికగా నటించగా..అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈమూవీలో మహేశ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా మే9న విడుదల చేయనున్నారు. ఈచిత్రం ప్రీ రిలీజ్ భారీ స్ధాయిలో జరుపుకుందని తెలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా థియేట్రికల్ హక్కులు 100కోట్లకు అమ్ముడుపోగా, నాన్ థియేట్రికల్ హక్కులు రూ. 45కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పటి వరకూ మహర్షి సినిమా 145కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని తెలుస్తుంది. డిజిటల్‌, శాటిలైట్‌ రూపంలో ఈ చిత్రానికి రూ.47.5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్‌ వర్గాల అంచాన. ఇక తెలుగు శాటిలైట్‌ రూపంలో రూ.14.5 కోట్లు తెచ్చుకున్న మహర్షి, డిజిటల్‌ హక్కుల పరంగా మరో రూ.11 కోట్లు సంపాదించింది. హిందీ డబ్బింగ్‌, శాటిలైట్‌ హక్కులు దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఆడియో హక్కులకు మరో రూ.2 కోట్లు. ఓవర్సీస్‌లో సత్తాచాటాడు మహేష్‌. మహర్షి ఓవర్సీస్ రైట్స్‌ రూ.12.5 కోట్ల వరకూ పలికిందని సమాచారం. ఆంధ్రా, సీడెడ్‌, నైజాం ఇలా ఏరియాల పరంగా కూడా ఈ సినిమాని ఇది వరకే అమ్మేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను దిల్ రాజు, అశ్వీనిదత్, పివిపిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేశ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈమూవీపై భారీ అంచనాలున్నాయి.

- Advertisement -