టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టించడమే పరమావధిగా భావిస్తున్న శ్రీరెడ్డి.. ఇప్పటికే సెమీ న్యూడ్ షో చేసి సెన్సేషన్ సృష్టించింది. తన దగ్గర చాలామందికి చెందిన సాక్ష్యాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్న ఈమె.. ఇప్పటివరకూ పలువురు చిన్నవాళ్ల పేర్లను నేరుగాను.. పెద్దోళ్ల పేర్లను ఇన్ డైరెక్టుగాను చెప్పింది. తాజాగా హీరోయిన్ శ్రీరెడ్డి… సంచలన ఫొటోలను బయటపెట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ తనను ముద్దాడుతున్న ఫొటోలను బహిర్గతం చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభిరామ్ పేరును ఇప్పటి వరకు తాను చెప్పలేదని తెలిపింది. ‘అరేయ్ అభిరామ్ నీకు సిగ్గుందా?’ అని అడుగుతున్నానని ఫైర్ అయింది. స్టూడియోలో నీవు ఎలా వాడుకున్నావో నీకు తెలుసు అంటూ బాంబు పేల్చింది. తనను ఎలా ముద్దాడుతున్నాడో ఫొటోలో చూడాలని… ఇప్పుడు సురేష్ బాబు కొడుకును బయటకు లాగాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వ్యక్తులను వదల కూడదని… ఇలాంటి వారికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు, దళిత సంఘాలు బయటకు రావాలని కోరారు. కొన్ని వందల మంది జీవితాలను ఇతను నలిపేశాడని చెప్పింది.