కుటుంబసభ్యుల సమక్షంలో శ్రియ పెళ్లి..!

255
- Advertisement -

తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న నటి నటి శ్రియాశరన్. 18 ఏళ్లుగా యాక్టింగ్ కెరీర్ ను సాగిస్తున్న సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతోంది. లేటు వయసులోనూ యంగ్‌ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా పోటినిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లిపీటలెక్కింది. రీల్ లైఫ్‌లో కాదు రియల్ లైఫ్‌లో.

కుటుంబసభ్యులు,అత్యంత సన్నిహితుల సమక్షంలో తన ప్రియుడు,రష్యాకు చెందిన కోషివ్‌ను పెళ్లిచేసుకుంది. ఈ నెల 12న శ్రియ పెళ్లిజరిగినట్లు మిడ్ డే టాబ్లాయిడ్ వార్తను ప్రచురించింది. వివాహానికి ముందుకు 11న విందు కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. శ్రియ వివాహం అంథేరిలో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.

DXCdZ7VW4AA56h0

బాలీవుడ్‌లో 2015లో అజయ్ దేవగణ్, టబు జంటగా వచ్చిన ‘దృశ్యం’ చిత్రంలో కనిపించిన లెటెస్ట్‌గా శ్రియ టాలీవుడ్‌లో బాలయ్యతో రెండు సినిమాలు చేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి,పైసా వసూల్ సినిమాల్లో నటించగా మంచు విష్ణుతో గాయత్రి సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ విషయంపై శ్రియ తరపు నుంచి ఎలాంటి అధికారిక సమాచరం లేదు.

- Advertisement -