మహేష్‌ ఆడియోకు గెస్టులుగా చరణ్‌,ఎన్టీఆర్‌..

317
NTR- Charan to meet CM at LB stadium
- Advertisement -

మ‌హేష్ బాబు, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం భ‌రత్ అనే నేను. పొలిటికల్‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్‌కి సంబంధించి విడుద‌లైన లుక్స్ అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెంచాయి. ఇటీవ‌లే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ 1న దేవి శ్రీ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఐ డోంట్ నో అనే సాంగ్ విడుద‌ల చేయ‌నున్నారు.

NTR- Charan to meet CM at LB stadium

ఇక ఈ మూవీ ఆడియో వేడుకను ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీస్థాయిలో జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఎన్టీఆర్‌ను .. చరణ్‌ను మహేష్‌ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. హాలీడే ట్రిప్స్‌లో ప‌లు సార్లు వీరు మ‌హేష్‌తో క‌లిసి క‌నిపించారు.

అంతేకాదు ఎన్టీఆర్ .. చరణ్ లతో కొరటాలకి కూడా ఎంతో సాన్నిహిత్యం వుంది. ఆల్రెడీ ఆయన ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ చేయగా .. త్వరలో చరణ్‌తో ఓ మూవీ చేసే ఛాన్స్ వుంది. ప్ర‌స్తుతం చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త నిజ‌మైతే ముగ్గురు స్టార్ హీరోల అభిమానుల‌కి పెద్ద పండుగే అని చెప్ప‌వ‌చ్చు. భ‌ర‌త్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న భారీ ఎత్తున విడుద‌ల కానుంది. కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో శ‌ర‌త్ కుమార్ , ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

- Advertisement -