తెలంగాణ ప్రభుత్వంపై మన్మోహన్ ప్రశంసలు

258
Manmohan praises Telangana
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కితాబిచ్చారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. కేసీఆర్ పనితీరుతో పిన్న రాష్ట్రమైన దేశంలోని మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్,బండ ప్రకాష్‌,బడుగుల లింగయ్య యాదవ్‌లను పార్లమెంట్ లాబీలో మన్మోహన్‌కు పరిచయం చేసిన కేకే…తెలంగాణ ప్రభుత్వ పథకాలు,సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతమన్నారు మన్మోహన్. తెలంగాణలో అభివృద్ధి ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజల కనీస అవసరాలు తీర్చే పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలు తనకు తెలుసు కనుకే పాలన ఉత్తమంగా సాగుతోందన్నారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు మన్మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని …రైతులకు పెట్టుబడి ఇస్తున్నామని చెప్పారు.

- Advertisement -